ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 02:43 PM

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.470 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,980కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,940కి చేరింది. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు పెరిగాయి. బంగార ధర నేటి మార్కెట్‌లో రూ.500 మేర భారీగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,910కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,700 అయింది. వెండి ధర రూ.900 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.47,300కి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa