కర్నూలు జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లాలో తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఆస్తి విషయమై ఇద్దరు అన్న దమ్ముల మధ్య గొడవలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఇరువురు జొన్నగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర ఇరు కుటుంబాల బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేసులు పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చినప్పుడు ఒకరినొకరు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసుకున్నారు. దాంతో బంధువులు వెంట తెచ్చుకున్న వేటకొడవళ్లతో పోలీస్ స్టేషన్ ఎదుటే దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడి ఘటనలో పలువురు తలలు పగిలాయి. ఆరుగురి తలలు పగిలాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ ఆదినారాయణరెడ్డి రంగంలోకి దిగారు. గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa