కరోనా పోతుందని జనం గుడ్డిగా నమ్మి పూజలు, నరబలులు ఇస్తున్నారు. తాజాగా జార్ఖండ్ ప్రజలు వింత చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని కోడెర్మా జిల్లాలో మొక్కుల పేరుతో ఏకంగా 400 గొర్రెలను ఆలయంలో బలిచ్చారు. ఇలా చేయడం ద్వారా వైరస్ తమ ఊరికి రాకుండా ఉండటంతో పాటు మంచి జరుగుతుందని గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో ఈ సామూహిక బలి విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉర్వాన్ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో కరోనా శాంతి పూజలు నిర్వహించారు. గ్రామస్థులంతా అక్కడికి చేరుకొని 400 గొర్రెలు, కోళ్లను బలి ఇచ్చారు. ఆ సమయంలో ఎవరూ భౌతిక దూరం పాటించలేదు. ఒకరిపై ఒకరు పడుతూ.. పూజా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో నిర్వాహకుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే ఒడిశాలోకూడా ఓ వ్యక్తి కరోనా పోతుందని ఆలయంలో పూజరి నరబలి ఇచ్చాడు. కటక్ జిల్లా నర్సింగ్ పూర్ లో బ్రాహ్మణిదేవి ఆలయంలో నరబలి ఇచ్చారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ఆలయ అర్చకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అర్చకుడు సంసారి హోజాను పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa