ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలర్ట్! రానున్న మూడు రోజుల్లో పిడుగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 01:50 PM

రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం సూచించింది. కోస్తాంధ్ర ప్రాంతంలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో బలపడనుంది. ఈ ప్రభావం వల్ల కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు. జూన్12న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, రాయలసీమలో చెదురు మదురుగా తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. జూన్13న కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఉన్నందున కోస్తాంధ్ర జిల్లాల అధికారులను విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది. ఈ మూడు రోజులు మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు పిడుగులు సైతం పడే అవకాశం ఎక్కువగా ఉండనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa