తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లైన తొలి రోజే భార్య రక్తపు మడుగులో ఉంటే భర్త సూసైడ్ చేసుకున్న ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొన్నేరి గ్రామంలో నీదివాసన్, సంధ్య పెళ్లి జరిగింది. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు అతికొద్ది మంది సమక్షంలో వివాహ వేడుకను నిర్వహించారు. గురువారం ఉదయం వారి గది తెరిచి ఉండడంతో కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లారు. అక్కడ రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న సంధ్యను చూసి షాక్ తిన్నారు. గదిలో నీదివాసన్ కనిపించలేదు. స్థానికంగా ఉన్న ఓ పొలంలో చెట్టుకు శవమై వేలాడుతూ కనిపించాడు. భార్యభర్తల మధ్య గొడవలు జరిగి సంధ్యను కొట్టి చంపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని నిర్దారించారు. పెళ్లైన రోజుకే ఇటువంటి ఘటన జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa