ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 11, 2020, 02:25 PM

ఏపీ సీఎం అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటి ముగిసింది. ఈ కేబినేట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం


భోగాపురం ఎయిర్ పోర్టు,రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.


రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులు కేటాయించాలన్న మంత్రివర్గం. నిధుల కోసం పోరాడుతూనే ప్రాజెక్టు పై ముందుకు వెళ్లాలని నిర్ణయం. 5 దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేయాలని నిర్ణయం. రామాయపట్నం పోర్టుకు ఆగస్టుకల్లా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం


వైఎస్సార్ చేయూత పథకానికి కేబినేట్ ఆమోదం. ఎస్సీ,ఎస్టీ,బీసీ మహిళలకు ఈ పథకం కింద 4 ఏళ్లలో రూ.50 వేల ఆర్ధిక సాయం. ఆగష్టు 12న ఈ పథకం ప్రారంభం.


గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల పై కేబినేట్ సబ్ కమిటి నివేదిక. ఫైబర్ నెట్,రంజాన్ తోఫా,చంద్రన్న కానుకల పై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa