ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల సంచలన నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 11, 2020, 02:17 PM

ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నవిషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ తరఫున న్యాయవాదుల వాదనాలు బలహీనంగా ఉండడంతోనే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయన్న విమర్శలు అధికార పార్టీ నేతల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి న్యాయ సలహాలు సైతం సరిగా అందడం లేదని.. అందుకే కోర్టులో మొట్టికాయలు తప్పడం లేదని విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.తమ పదవులకు ఆ ముగ్గురు రాజీనామాలు చేయగా.. వెంటనే ప్రభుత్వం వాటిని ఆమోదించింది. ఈమేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, షేక్ హబీబ్, గెడ్డం సతీష్ బాబు రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. వారి రాజీనామాలను ఆమోదించాలని అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఆ ముగ్గురు రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు వెలుబడ్డాయి. హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వరుస దెబ్బలు తగులుతుండడంతో.. ప్రభుత్వమే వారి చేత రాజీనామాలు చేయించిందని పలువురు భావిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa