ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా ఎఫెక్ట్.. సిలబస్ తగ్గింపు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 11, 2020, 02:12 PM

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పాఠశాలలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇప్పటికే విద్యాసంస్థలు ప్రారంభమై సందడి వాతావరణం ఉండేది. కానీ ఈ సారి ఇప్పట్లో పాఠశాలలు మొదలయ్యే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు. పదో తరగతి పరీక్షలనే ప్రభుత్వం రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ త్వరలో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనా సిలబస్ పూర్తి చేయడం అసాధ్యం. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని 2020-21 విద్యా సంవత్సరంలో సిలబస్‌ను, బోధనా తరగతులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తి నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఉపాధ్యాయులు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని నిశాంక్ పిలుపునిచ్చారు. ‘#సిలబస్‌ ఫర్‌ స్టూడెంట్స్‌ 2020’ అనే వేదిక నుంచి లేదా తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో అభిప్రాయాలను తెలియజేయొచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa