ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘కరోనాకు మందు వచ్చేసింది’

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 11, 2020, 02:08 PM

కరోనా యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి ఆట కట్టించేందుకు వ్యాక్సిన్ కనుగొనేందుకు అనేక కంపెనీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని కంపెనీల వ్యాక్సిన్ ట్రయల్స్ వరకు వచ్చింది. కొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ అంటూ ఓ ప్రచారం సాగుతుండగా.. వాక్సిన్ వచ్చేందుకు కనీసం మరో ఏడాది అయినా పడుతుందని మరి కొందరు నిపుణులు చెబుతున్నారు. అసలు కరోనాకు వ్యాక్సిన్ రావడం అసాధ్యమనే వారు కూడా ఉన్నారు.


ఈ విషయాలను పక్కన పెడితే కరోనా నుంచి కోలుకునేందుకు తన వద్ద మందు ఉందని ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ సంచలన ప్రకటన చేశారు. ప్రాణాంతక ఈ వ్యాధికి గిలోయ్, అశ్వగంధతో చికిత్స చేయవచ్చునని ఆయన ధీమాగా చెబుతున్నారు. రామ్‌దేవ్ చెప్పిన వివరాల ప్రకారం.. కరోనా వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోయి మొత్తం కణాలు, వ్యవస్థను దెబ్బకొడుతుంది. అంతటితో ఆగకుండా వైరస్ సంఖ్య రెట్టింపవుతూ ఉంటుంది. అశ్వగంధ, గిలోయ్ శరీరం లోపల సంక్రమణ గొలుసు(వైరస్ చైన్)ను విచ్ఛిన్నం చేయడంలో వందశాతం ఫలితాన్నిస్తుందని చెబుతున్నారు.


ఇప్పటికే పరీక్షలు పూర్తి..


కరోనా సోకిన రోగులపై గిలోయ్, అశ్వగంధ పరీక్షలు ఇప్పటికే జరిగాయని రామ్‌దేవ్ తెలిపారు. ఈ మందు వంద శాతం రికవరీ రేటును సాధించిందని స్పష్టం చేస్తున్నారు. కరోనా సోకిన వారికి గిలోయ్, అశ్వగంధ, తులశివతి ఖాళీ కడుపుతోనూ.. తినడం తరువాత ఇచ్చామన్నారు. దీంతో 100 శాతం రికవరీ రేటు, 0 శాతం మరణ రేటు ఉందంటున్నారు. అయితే, ప్రస్తుతం క్లినికల్ కంట్రోల్ ట్రయల్ జరుగుతోందని ఆయన వెల్లడించారు. పతాంజలి పరిశోధన పూర్తయిందని, శాస్త్రీయ పత్రాలను దేశం ముందు త్వరలోనే ఉంచుతామని బాబా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. జపాన్‌లోని AISTసహకారంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఢిల్లీ శాస్త్రవేత్తల బృందం, అశ్వగంధకు కరోనా వైరస్ తో పోరాటం చేయగల సామర్థ్యం ఉందని కనుగొన్నారు. రాందేవ్ బాబా వద్ద ఉన్న కరోనా మందు సత్ఫలితాలు ఇచ్చి ప్రపంచాన్ని కాపాడాలని ఆశిద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa