ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి వాతావరణ సమాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 11, 2020, 01:20 PM

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉన్నట్టుండి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రానికి రావొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిప్రభావంతోనే గురు, శుక్ర వారాల్లో ఓ మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ కర్నాటక, రాయలసీమ, తమిళనాడులోని మెజార్టీ జిల్లాలను తాకాయని పేర్కొంది. బంగాళా ఖాతం తీరం వెంబడి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఇక్కడ నుంచి నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర కర్నాటకలోని ఇతర ప్రాంతాలకు అక్కడి నుంచి తెలంగాణకు విస్తరిస్తాయని వెల్లడించింది.


 


తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అక్కడ అల్పపీడనం ఏర్పడి రానున్న 2 రోజుల్లో అది తుఫానుగా మారుతుందని స్పష్టం చేసింది. ఈ తుఫాను క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో మరింత తీవ్రగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ప్రస్తుత పరిస్థితులు తెలంగాణ కోస్తాంధ్రకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా ప్రాంతాలతో పాటు యానాంలో కూడా ఈ వర్షాలు అధికంగా కురుస్తాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతం, రాయలసీమల్లో జూన్ 11న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇకపోతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం.


 


 


జిల్లాల వారీగా నేడు నమోదు కానున్న ఉష్ణోగ్రత వివరాలివే.


 


విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు :


నేడు గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.25 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.33 గంటలకు కానుంది.


ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :


నేడు గరిష్టంగా 37 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.20 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.30 గంటలకు కానుంది.


 


నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.36 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.37 గంటలకు కానుంది.


 


ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.38 గంటలకు కానుంది.


 


కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :


నేడు గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.45 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.47 గంటలకు కానుంది.


కడప జిల్లా ఉష్ణోగ్రతలు :


నేడు గరిష్టంగా 39 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.42 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.38 గంటలకు కానుంది.


 


గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 37 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.32 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.33 గంటలకు నమోదు కానుంది.


 


కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.33 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.38 గంటలకు కానుంది.


 


విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :


నేడు గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.27 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.32 గంటలకు కానుంది.


చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :


నేడు గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.42 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.39 గంటలకు కానుంది.


అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 39 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.39 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.47 గంటలకు కానుంది.


 


కరీంనగర్ జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 37 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.37 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.48 గంటలకు కానుంది.


 


సంగారెడ్డి జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.41 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.50 గంటలకు కానుంది.


ఖమ్మం జిల్లా ఉష్ణోగ్రతలు :


నేడు గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీలు నమోదు కానుంది. ఉదయం 5.30 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.26 గంటలకు కానుంది.


 


నిజామాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 39 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.40 గంటలకు సూర్యోదయం అవ్వగా సూార్యాస్తమయం 6.52 గంటలకు కానుంది.


 


సూర్యాపేట జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.36 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.43 గంటలకు కానుంది.


 


నల్గొండ జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.45 గంటలకు కానుంది.


 


మహబూబ్ నగర్ జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 39 గ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీలు నమోదైంది. 5.30 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.27 గంటలకు నమోదు కానుంది.


 


యాదాద్రి జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 36 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.46 గంటలకు కానుంది.


 


వరంగల్ జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 37 డిగ్రీలు, కనిష్టంగా 29 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.35 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.45 గంటలకు కానుంది.


 


సిద్దిపేట జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 38 డిగ్రీలు, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.38 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.48 గంటలకు కానుంది.


 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉష్ణోగ్రతలు :


 


నేడు గరిష్టంగా 37 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.32 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.39 గంటలకు కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa