ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ వీఆర్ఏలకు శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 12:38 PM

రెవెన్యూ శాఖలో 3,795 వీఆర్ఓ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్ల ద్వారా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో వేల సంఖ్యలో వీఆర్ఓ పోస్టుల్ని భర్తీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే చాలా ఏళ్లుగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నవారికి వీఆర్ఓ పోస్టుల్ని ఇవ్వాలని పలు ఉద్యోగ సంఘాలు ఏపీ ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 3,795 వీఆర్ఓ పోస్టుల్ని ప్రకటించింది. ఈ పోస్టులు వీఆర్ఏలకు మాత్రమే. ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్ఏలను మాత్రమే ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. సీనియారిటీ ప్రాతిపదికన ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ పోస్టుల్ని భర్తీ చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.


మొత్తం వీఆర్ఓ పోస్టులు- 3,795 (వీఆర్ఏలకు మాత్రమే)


విద్యార్హత- ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పాస్ కావాలి. ఇంటర్ చదవకుండా డిస్టెన్స్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారు కూడా అర్హులే


ఇతర అర్హతలు- 2020 జనవరి 1 నాటికి వీఆర్ఏగా ఐదేళ్ల సర్వీస్ పూర్తి కావాలి.


ఎంపిక విధానం- సీనియారిటీ, సర్టిఫికెట్ వెరిఫికేషన్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa