ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్స్ ఓపెన్ పై క్లారిటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 12:29 PM

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ విద్యా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. పాఠశాలల నుంచి కళాశాలలు యూనివర్సిటీల వరకు అన్నీ ముతబడ్డాయి. తొమ్మిదవ తరగతుల వరకు అనేక రాష్ట్రాలు విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపించారు. ఇటీవల తెలంగాణలో పది పరీక్షలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తమ పిల్లల భవిష్యత్ పై తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఈ తరుణంలో దేశంలో స్కూళ్ల ను తెరిచే అంశంపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఆగస్టు తర్వాతే స్కూళ్లు ఓపెన్ అవుతాయని కేంద్ర మంత్రి రమేష్ ప్రోఖ్రియాల్ స్పష్టం చేశారు. అవకాశం ఉంటే ఆగస్టు 15 తర్వాత స్కూళ్లు ప్రారంభమవుతాయని.. ఈలోపు పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa