ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దిశ కేసులో సంచలన నిజాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 12:26 PM

విశాఖలో సంచలనం సృష్టించిన దిశా కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు హత్యలో నలుగురికిపైగా వ్యక్తులు పాల్గొన్నట్లు అంచానకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితురాలు వసంత, ఆమె సోదరి మంజులను అదుపులోకి తీసుకుని‌ విచారిస్తున్నారు. దివ్యను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.


అత్యంత పాశవికంగా దివ్య హత్య


నిందితులు దివ్య కాళ్లు, చేతులను కట్టేసి పెద్ద అట్ల‌కాడతో అత్యంత పాశవికంగా ఒళ్లంతా వాతలు పెట్టినట్లు గుర్తించారు. బాధితురాలకి గుండు కొట్టించి, కనుబొమ్మలను సైతం తొలగించారు. దాదాపు ఐదారు రోజులపాటు భోజనం కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టారు. ఒళ్లంతా గాయాలు చేసి అయిదారు రోజులు ఆహారం పెట్టకపోవడంతో దివ్య మరణించింది. మృతురాలి శరీరంపై 33 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. హత్య చేసిన రోజే మృతదేహాన్ని తరలించడానికి నిందితులు ప్రయత్నం చేశారు. రాత్రి అంతిమయాత్ర వాహన యాజమాని నాయుడును సంప్రదించారు. ఎంత డబ్బైనా ఇస్తామని, శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించాలని ఒత్తిడి చేశారు. దివ్య శరీరంపై గాయాలను గమనించిన నాయుడు పోలీసులకు విషయాన్ని తెలిపాడు. ఫోర్త్ టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మరికొందరు‌ నిందితుల‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.


ఆర్థిక లావాదేవీలతోనే?


దివ్యను తన ఇంట్లోనే ఉంచి వసంత అనైతిక కార్యకలాపాలకు ఉపయోగించి డబ్బు సంపాదించేది. ఇటీవల‌ కాలంలో ఇద్దరి మధ్య ఆర్ధిక విషయాల్లో విభేదాలు తలెత్తాయి. దీంతో వసంత నుంచి‌ బయటకి వెళ్లిపోవాలని‌ దివ్య నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో దివ్యపై కక్ష పెంచుకున్న నిందితులు క్రూరంగా హత్యచేసినట్లు తెలస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa