ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వార్తలు అవాస్తవమన్న ఏపీ సర్కార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 12:14 PM

ఆంధ్రప్రదేశ్ లో సరిహద్దు చెక్‌ పోస్టులను సోమవారం నుంచి ఎత్తివేస్తున్నట్లు ఈ రోజు జోరుగా వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవస్తవమని ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్‍ టాస్క్‌ఫోర్స్ చైర్మన్‍ కృష్ణబాబు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్‌ పోస్టులన్నీ లాక్‌డౌన్‌ ముగిసే వరకూ కొనసాగుతాయన్నారు. ఏపీకి వచ్చే వారంతా తప్పనిసరిగా ‘స్పందన’ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సిందేనన్నారు.ఇందుకు తగ్గట్లుగా ప్రయాణాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఇక కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్) నుంచి వచ్చే వారు తప్పనిసరిగా 7 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలన్నారు. తెలంగాణకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక బస్సులు నడుపుతామని తెలిపారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ (సోమవారం) నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి ఏపీఎస్‌ ఆర్టీసీ సన్నద్ధమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa