ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్య హత్య కేసులో బయటపడుతున్న నిజాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 07, 2020, 11:23 AM

విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం సమీపంలోని నందగిరినగర్ ప్రాంతంలో గురువారం 22 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన దివ్యకు తల్లిత్రండులు లేరు. వారు హత్యకు గురయ్యారని సమాచారం. దివ్య సోదరుడు కూడా హత్యకు గురయ్యాడు. దీంతో దివ్య తన పిన్ని ఇంట్లో పెరిగింది. 8 నెలల క్రితం అక్కడ ఉండడం ఇష్టం లేని దివ్య విశాఖకు వచ్చింది. విశాఖలో వసంత అనే మహిళ పరిచయమైంది. ఆమె భర్త దుబాయిలో ఉంటాడు. దివ్య అందాన్ని ఆసరాగా చేసుకున్న వసంత ఆమెను వ్యభిచార వృత్తిలోకి దింపింది. అలా దివ్యను అడ్డం పెట్టుకొని వసంత బాగా డబ్బు సంపాదించింది.ఇటీవల నగదు పంపకాలకు సంబంధించి ఇద్దరి మధ్య తేడాలొచ్చాయి. దీంతో దివ్య తాను వెళ్లిపోతానని బెదిరించింది. దీనికి ఆగ్రహించిన వసంత దివ్యను మట్టుబెట్టాలని ప్లాన్ వేసింది. తన సోదరి మంజుతో కలిసి కుట్ర పన్నింది. మరో వ్యక్తితో కలిసి దివ్యను ఓ రూంలో వేసి గుండు కొట్టించారు. కన్ను రెప్పలు కట్ చేశారు. శరీరమంతా వాతలు పెట్టి అంద విహీనంగా తయారు చేశారు. అలా ఐదు రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా చేసి హింసించారు. చివరకు వారి హింసను తట్టుకోలేెక దివ్య గురువారం చనిపోయింది.వసంత ఏం తెలియనట్టుగా నటించి ఫిట్స్ తో చనిపోయిందని దివ్య బంధువులకు సమాచారమిచ్చింది. దివ్య శరీరం పై మొత్తం పూలతో కప్పేసింది. అంత్యక్రియల కోసం కాటికాపరికి సమాచారమివ్వగా అతను యువతి వివరాలు తీసుకున్నాడు. 22 ఏళ్ల యువతి ఫిట్స్ తో చనిపోవడమేంటని అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చాడు.పోలీసులు వచ్చి చూడగా దివ్య శరీరం పై గాయాలు,సిగరెట్ తో కాల్చిన వాతలు కనిపించాయి. పోలీసు జాగిలాలు వసంత,ఆమె సోదరి మంజుల చుట్టే తిరిగాయి. దీంతో పోలీసులు కూపీ లాగగా అసలు విషయం బయటపడింది. మరికొంత మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa