ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవి తింటే గుండె సమస్యలు పరార్!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 07, 2020, 11:14 AM

మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఒక్క రోజులో మనిషి ఎక్కువగా పోషకాలు, విటమిన్లూ, ఖనిజాలు ఉండే ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటివి ఉండేవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక బరువుతో ఉండేవారికి కూడా గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండేందుకు ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.కొంతమంది భోజనం చేసినా మళ్లీ చిరుతిళ్లవంటివి తింటారు. అలా చెయ్యకూడదు. కావాలంటే భోజనం కొద్ది కొద్దిగా రెండుసార్లు తినడం మంచిది. ప్రతీ రెండు గంటలకు ఓసారి ఎంతో కొంత ఏదో ఒకటి తినాలి. అయితే భోజనం వంటివి మరీ ఎక్కువగా తినకుండా జాగ్రత్త పడాలి.కేకులు, చాకొలెట్లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఇవన్నీ చాలా రుచిగా ఉంటాయి. కానీ వీటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అది మన గుండెకు ప్రమాదకరం. ఇవి ఎక్కువగా తింటే మన రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. అవి రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరల్లో గడ్డలుగా గూడుకడతాయి. ఏదో ఒక రోజు అదే కొవ్వు రక్త సరఫరాను అడ్డుకుంటుంది. అంతే హార్ట్ ఎటాక్ వచ్చేస్తుంది. అందువల్ల డేంజర్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. అప్పుడప్పుడూ తింటే పర్లేదు గానీ రోజూ అలాంటివి తింటే గుండెకు ఇబ్బందిగా ఉంటుంది. మాంసం, చికెన్, చేపలు, గుడ్ల వంటివి ప్రోటీన్స్ (మాంసకృత్తులు) ఎక్కువగా ఉండే ఆహారాలు. అయితే ఈ ఫుడ్‌లో కూడా బీఫ్ అయితే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దానికి బదులుగా చికెన్, మటన్ వంటివి తినడం ఉత్తమం. చేపలు మంచివి. వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి కొవ్వును తగ్గిస్తాయి. గింజలు, బఠాణీలు, వేరుశనగ వంటివి కూడా కొద్ది మొత్తాల్లో తీసుకుంటే చాలా మేలు.వరి‌, గోధుమలతోపాటూ రాగులు, జొన్నలు, సజ్జల వంటివి ఈమధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజానికి అవి అన్నీ తినాలి కూడా. ఇక వాటిలోనూ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వచ్చేసింది. అది రేటు ఎక్కువైనా మన శరీరానికి చాలా మంచిదే. ఇలా మనం తినే వాటిలో బ్యాలెన్స్‌డ్ ఫుడ్ ఉండేలా చేసుకోవాలి. మనం తినే ఆహారాల్లో మృతం, అమృతం అని రెండు రకాలుంటాయి. డీప్ ఫ్రై చేసే ఆహారం మృత ఆహారం. అది తినడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అదే ఆకు కూరలు, కూరగాయలు, కాయలు, పండ్ల వంటివి మృతం కానీ అమృత ఆహారం. అవి ఎంత తింటే అంత మన శరీరానికి మేలు జరుగుతుంది. అమృతాహారంలో పోషకాలు ఎక్కువ, కొవ్వు తక్కువగా ఉంటుంది. అందువల్ల అవి తింటే గుండెకు ఎంతో మేలు కలుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa