ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఏనుగు పోస్టుమార్టం.. రిపోర్టుల్లో ఏముందంటే..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 11:53 AM

దేశంలో సంచలనం సృష్టించిన ఏనుగు కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు పదార్థాలు ఉన్న పైనాపిల్‌ తినటం కారణంగా మరణించిన గర్భంతో ఉన్న ఏనుగు పోస్టుమార్టాన్ని అధికారులు నిర్వహించారు. ఈ రిపోర్టులో అనేక కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఏనుగు నోటిలో పెద్ద మొత్తంలో పేలుడు సంభవించటం కారణంగా తీవ్రమైన గాయాలయ్యాయని అధికారులు తేల్చారు. వాటి కారణంగా ఇన్‌ఫెక్షన్‌ సైతం సోకినట్లు నిర్దారించారు.ఇన్‌ఫెక్షన్‌ కారణంగా విపరీతమైన నొప్పి, ఒత్తిడితో బాధపడుతూ ఏనుగు నీరు, ఆహారం తీసుకోలేకపోయిందని బయటపడింది. అలా దాదాపు రెండు వారాల పాటు నీరు, తిండి లేకుండా గడిపిందని గుర్తించారు. దీంతో తీవ్ర నీరసానికి గురైన ఏనుగు నీళ్లలో మునిగిపోయిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత భారీగా నీటిని తీసుకోవటంతో ఊపిరితిత్తులు పాడై ఆ వెంటనే అది మరణించినట్లు పోస్టుమార్టంలో తేలింది.ఈ ఏనుగు వయస్సు సుమారు 15 ఏళ్లు ఉంటుందని అధికారులు నిర్దారించారు. ఏనుగు శరీరంలో బుల్లెట్‌, ఇతర లోహాల ఆనవాళ్లు లేవని పోస్టుమార్టం రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa