లాక్డౌన్ కారణంగా అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందు ఆయా విద్యా విభాగాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించేందుకు జేఎన్టీయూ హైదరాబాద్ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 20 నుంచి బీటెక్, బీ ఫార్మసీ పరీక్షలు నిర్వహిస్తామని యునివర్సిటీ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో పరీక్షలు ఎలా నిర్వహించాలన్న దానిపై జేఎన్టీయూ విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే..
కాలేజీ స్టాఫ్, విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలి.
పరీక్ష సమయాన్ని రెండు గంటలకు కుదించారు.
పరీక్ష పత్రం మోడల్ ను కూడా మార్చారు. 8 ప్రశ్నలకు గాను ఏవైనా 5 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది.
తప్పనిసరిగా రాయాల్సిన సెక్షన్ను ఈ విద్యా సంవత్సరం తొలగించారు.
20 నిమిషాల్లోనే సమాధానం రాసేలా ప్రశ్నలను రూపొందించారు
.విద్యార్థులకు ఇబ్బందుల లేకుండా ఈ ఏడాది డిటెన్షన్ విధానం రద్దు చేశారు.
జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేశారు. విద్యార్థులు చదువుతున్న కాలేజీల్లోనే సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షలకు హాజరుకాలేకపోతే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసేందుకు అవకాశం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa