హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలున్నా శనీశ్వరుడి స్థానం ప్రత్యేకం. శనీశ్వరుడు యమధర్మరాజుకి సోదరుడు. సూర్యుడికి కొడుకు. సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుణ్ణీ దర్శనం చేసుకుంటాం. ఇది ఇలా ఉంటే కొన్ని ఏళ్ళ నాటి శని పోవాలంటే ఈ ఆలయాన్ని దర్శించాలని చెబుతున్నారు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.కాంచీపురం జిల్లాలోని శ్రీ పెరంబదూర్ పట్టణంలో ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ఉంది. ఇది అత్యంత ప్రాచీనమైన దివ్యక్షేత్రం. ప్రధాన ఆలయ మంటపంలో రామానుజ గురుదేవుల ప్రతిమతో పాటుగా యతిరాజానంతవల్లి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఇక్కడి గజస్తంభానికి బంగారు తొడుగు ఏర్పాటు చేయబడింది. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో మానవుని జీవితం మీద నవగ్రహాలు ప్రభావాన్ని చూపిస్తాయి. ఖగోళంలో వున్న గ్రహాలకూ, నవగ్రహాలకు కొన్ని వ్యత్యాసాలున్నాయి. శని నవగ్రహాలలో ఒకటి. మనుష్యుల జీవితావధిలో మూడు సార్లు ప్రవేశిస్తుందనేదే జ్యోతిష్యశాస్త్రం. పుంగుశని,మంకుశని, మరణశని అనే రూపాల్లో శనీశ్వరుడు ప్రవేశిస్తాడు.శని మానవజీవితంలో ప్రవేశించిన తర్వాత ఏడున్నర సంవత్సరాల కాలం వుంటాడని నమ్ముతారు. అదేవిధంగా ఆ ఏలినాటిశని వున్న సమయంలో అయ్యే నష్టం, దుష్టపరిణామాలు తగ్గించుకోవటానికి ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయం శనిదేవునికి అంకితం చేయబడింది. తులసిమాలను సమర్పించి ఇక్కడి శని భగవంతుడిని ఆరాధిస్తారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa