ఆన్ లైన్ వ్యాపార ప్రకటనల రంగంలో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిన కారణంగా టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కు 2019 మార్చి 20న యూరోపియన్ యూనియన్ (ఈయు) 1.5 బిలియన్ యూరోల (సుమారుగా 1.7 బిలియన్ డాలర్లు) జరిమానా విధించిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. గూగుల్ యాడ్ సెన్స్ వ్యాపార ప్రకటన వ్యాపారంపై సుదీర్ఘ కాలంగా సాగుతున్న దర్యాప్తు వివరాలను మార్గరెట్ వెస్టేజర్ బ్రస్సెల్స్ లో ప్రకటించారు. 'తన ఆధిపత్యాన్ని దుర్వినియోగ పరచి గూగుల్ వెబ్ సైట్లు తన యాడ్ సెన్స్ ప్లాట్ ఫామ్ తప్ప ఇతర బ్రోకర్లను ఉపయోగించకుండా అడ్డుపడటంపై ఇవాళ నిర్ణయం ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు.'తన ప్రత్యర్థులు తమ నూతన ఆవిష్కరణలు, శక్తిసామర్థ్యాల ద్వారా మార్కెట్లో పోటీపడే అవకాశాన్ని గూగుల్ నిరోధించిందని' వెస్టేజర్ చెప్పారు. 'దీంతో ప్రకటనకర్తలు, వెబ్ సైట్ యజమానులకు ఎంపిక చేసుకొనేందుకు ఎక్కువ ప్రత్యామ్నాయాలు లేక ఆయా అధిక ధరలను తమ వినియోగదారులకు బదలాయించక తప్పలేదని' వివరించారు.గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఈయూ యాంటీ ట్రస్ట్ నియమాలను ఉల్లంఘించినట్టు కమిషన్ గుర్తించింది. తమ యాడ్ సెన్స్ ఉపయోగించే వెబ్ సైట్ల కాంట్రాక్టుల్లో నిర్బంధ నిబంధనలు విధించి గూగుల్ ప్రత్యర్థులు ఈ సైట్లలో తమ ప్రకటనలు పెట్టకుండా అడ్డుకున్నాయని కనుగొంది. అంతేకాకుండా, రాయిటర్స్ కథనం ప్రకారం 'ప్రైవేట్' ఇంటర్నెట్ వినియోగాన్ని ట్రాక్ చేసినందుకు గూగుల్ యూఎస్ లో 5 బిలియన్ డాలర్ల దావాను ఎదుర్కొంటుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa