దేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో మహారాష్ట్రలోని షిర్డీ ఒకటి. సాయిబాబా అంటే మనిషి రూపంలోని దేవుడిగా ఆయనను భక్తులు నమ్ముతారు. ఈయన సాధువు కనుక హిందువులు శివుని అవతారంగా సాయిబాబాను కొలుస్తారు. ఇక్కడ ఒక సాయిబాబా ఆలయం దక్షిణ షిర్డీగా కొలుస్తూ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటి అనేది తెలుసుకుందాం.కర్నూలు నగరంలో తుంగభద్రా నదీ తీరమున శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం కలదు. ఈ ఆలయ విషయానికి వస్తే, అతిపెద్ద సాయిబాబా ఆలయాలలో ఒకటైన ఈ ఆలయం 1.5 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయం తుంగభద్రా నది ఒడ్డుపై ఒక రజకునిచే నిర్మించబడింది. ఇది నక్షత్రం ఆకారంలో వుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీదేవి, హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో సుమారు 800 మంది ప్రజలు పెద్ద ధ్యాన మందిరంలో ధ్యానం చేయవచ్చు. ఈవిధంగా దక్షిణ షిరిడిగా పేరుగాంచిన తుంగభద్రా నది తీరాన వెలసిన ఈ సాయిబాబా మందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa