ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శేష జీవితాన్ని సమాజ సేవలో గడపండి: యూటీఎఫ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 02, 2020, 03:30 PM

యూటీఎఫ్ ప్యాపిలి మండల శాఖ ఆధ్వర్యంలో యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు శ్రీమతి లక్ష్మీదేవి అధ్యక్షతన మే నెల 3 న పదవీ విరమణ పొందిన బాలుర ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి చంద్రలీలమ్మ మరియు హుస్సేనపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తం నాయుడు సన్మాన సభ ప్యాపిలి బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన యూటీఎఫ్ జిల్లాకార్యదర్శి అబ్దుల్ లతీఫ్ మాట్లాడుతూ పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగి జీవితంలో తప్పని సరి అని అయితే పదవిలో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు వారు చేసిన సేవలే వారికి గుర్తింపుని ఇస్తాయని ఈ విధంగా కరోనా కస్ట కాలంలో కూడా వారి సేవలని గుర్తించి యూటీఎఫ్ ప్యాపిలి మండల శాఖ సన్మానించడం గొప్ప విషయం అని అన్నారు.చంద్రలీలమ్మ ప్యాపిలి మండలంలో ప్రధానోపాధ్యాయులు గా మండల విద్యాధికారిగా విస్తృత సేవలు అందించారని గాడి తప్పిన మండల విద్యావ్యవస్థని ప్రతి పాఠశాలని మొక్కుబడిగా సందర్శించడం కాకుండా పాఠశాలలో ఒక గంట సమయాన్ని విద్యార్థుల విద్యాప్రమానాలని పరీక్షించేందుకు కేటాయించి పాఠశాల విద్యను బలోపేతానికి చాలా బాగా కృషి చేశారని,వారి సేవలని గుర్తించి ప్రభుత్వం ఉత్తమ ప్రధానోపాధ్యాయులు అవార్డ్ ను కూడా ఇచ్చారన్నారు. యూటీఎఫ్ చేపట్టిన కేరళ వరద బాధితుల సహాయార్థం మేడం గారు ప్యాపలి లో విరాళాలు సేకరించారు.యూటీఎఫ్ చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములై ముందుకు నడిపించారు. ఇక పురుషోత్తం నాయుడు సర్ గారు కూడా పాఠశాల విద్య బలోపేతానికి తమ వంతు సంపూర్ణ సహకారం అందించారని వారి సేవలని గుర్తించి ఉత్తమ ప్రధానోపాధ్యాయులు అవార్డ్ ఇచ్చారని అన్నారు.శేషాజీవితాన్ని సమాజ సేవకి వినియోగించాలని ఆయన వారిని కోరారు.సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ యూటీఎఫ్ సమాజ సేవలో ఉపాధ్యాయుల సేవలో మంచి పని చేయడంలో అందరికంటే ముందు ఉంటుందని అటువంటి యూటీఎఫ్ కుటుంబంలో మేము భాగస్వామ్యం అయినందుకు మాకు గర్వాంగ ఉందని వారు అన్నారు.ఇద్దరు కూడా మొదటి నుండి యూటీఎఫ్ సభ్యులుగా ఉంటూ యూటీఎఫ్ అభివృద్ధి కి తమ వంతు సహాయసహకారాలు అందించారని అటువంటి వారిని యూటీఎఫ్ ప్యాపలి మండల శాఖ ఘనంగా సన్మానించడం సంతోషాదాయకమని యూటీఎఫ్ మండల కార్యదర్శి నరసింహారెడ్డి అన్నారు.కార్యక్రమంలో వక్తలు వారి సేవలని కొనియాడారు.కార్యక్రమంలో యూటీఎఫ్ సహాధ్యక్షులు వాసవి ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి జిల్లాకౌన్సిలర్స్ శ్రీధర్ రాజు చంద్రమోహన్ హుస్సేన్ బాషా నాగమణి లక్ష్మీదేవి షాహిదా మహేశ్వరమ్మ సుబ్బలక్ష్మమ్మ సుదాపరిమల నాగమల్లేశ్వరమ్మ నందీశ్వర రెడ్డి నాగేశ్వర రెడ్డి మోహనరావు నిషార్ అహ్మడ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa