ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకించాలి: సిఐటియు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 02, 2020, 03:28 PM

కేంద్రం ప్రతిపాదిత‌ విద్యుత్ సవరణ బిల్లును ప్ర‌జ‌లు వ్య‌తిరేకించి కేంద్ర ప్ర‌భుత్వానికి బుద్ది చెప్పాల‌ని యుఈసిడబ్ల్యుయు జిల్లా అధ్యక్షులు హెచ్ సత్యనారాయణ 1104 రాష్ట్ర నాయకులు ఎం ఖ‌లందర్ కోరారు. సోమ‌వారం ఆలూరు విద్యుత్ సబ్ డివిసన్ కార్యాలయ ఆవరణలో యుఈసిడబ్ల్యుయు యుఈఈయు (సిఐటియు) 1104 ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 17న విద్యుత్ చట్టం 2003కు సవరణలు ప్రతిపాదిస్తూ విద్యుత్ ( సవరణ) చట్టం 2020 ముసాయిదా బిల్లును ప్రకటించి 21 రోజుల గడవులోగా సూచనలు సలహాలు చెప్పాలని ప్రజల ముందు ఉంచారన్నారు.లాక్‌డౌన్‌ సమయంలో ఎలా సాధ్యమని ఒత్తిడి రావడంతో జూన్ 5 వరకు పొడిగించారన్నారు. ఎలాగైనా మోడీ ప్రభుత్వం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదింప చేసుకోవాలని పట్టుదలతో ఉందన్నారు. దేశంలో కేరళతో సహా మరో మూడు రాష్ట్రాలలో బతికి వున్న విద్యుత్ బోర్డులు సంస్థలు ఈ బిల్లుతో భూస్థాపితయ‌వుతాయన్నారు. విద్యుత్ సవరణ చట్టం ఆమోదం పొందితే కేంద్రం ప్రయివేటు సంస్థలకు అప్పజెప్పి ప్రభుత్వవిద్యుత్ రంగాన్ని నాశనం చేయడం ఖాయమన్నారు. ప్రజలు సవరణ చట్టాన్ని వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా సిఐటియు ఆలూరు మండల కార్యదర్శి షాకీర్ యుఇఇయు నాయకులు నాగేంద్ర నటరాజ్ ఇబ్రహీం 1104 నాయకులు పంపావతి వంశీ శంకర్ యుఈసిడబ్ల్యూయు నాయకులు సోమశేఖర్ సంతోష్ బాష కార్మికులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa