ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 02, 2020, 03:25 PM

కర్నూలు జిల్లా లోని పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం కొరటమద్ది గ్రామంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంతో ఉంటామని ఆయన అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ శుభ్రత ను పాటించాలని ఆయన సూచించారు. రాబోయే కాలంలో వర్షాల వల్ల అనేక రకాల వ్యాధుల నుండి మనం పరిశుభ్రంగా ఉండి వాటిని తరిమి కొట్టాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ పెద్దలు మరియు ఇతర ఉన్నతాధికారులు మరియు గ్రామ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa