మండల పరిధిలోని కుప్పగల్ గ్రామంలో వలస కూలీలకు ఉపాధి పథకం కింద పనులు కల్పించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు మండల కార్యదర్శి శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం గ్రామ సచివాలయం ముందు వలస కూలీలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్తో వలస కూలీలకు గ్రామ ప్రజలకు ఉపాధి పనులు లేవన్నారు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు గతంలో పని చేసిన ఐదు వారాలకు సంబంధించిన బిల్లులు రాక కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని ఉపాధి పనులు చేపట్టాలని లేనియెడల ఎంపిడిఓ కార్యాలయం ముందు నిరాహారదీక్ష చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వలస కూలీలు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa