ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాగునీటిపై అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 02, 2020, 03:15 PM

సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి తాగునీటి సరఫరాపై అప్రమత్తంగా ఉండాలంటూ కమిషనర్ ఆదేశాలు కర్నూలు నగరాభివృద్ధికి మునిసిపల్ కొర్పొరేషన్ లోని అన్ని శాఖల వారు సమన్వయంతో కలిసి పనిచేసినప్పుడే సత్ఫలితాలు సాధిస్తామని నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం 27వ వార్డు అబ్బాస్ నగర్ లోని 69వ వార్డు సచివాలయం శరీఫ్ నగర్ లోని బాబు జగజీవన్ రాం పార్కు పరిసరాల్లో ఉన్న 28వ వార్డు 71వ వార్డు సచివాలయం 29వ వార్డు 75వ వార్డు సచివాలయం కల్లూరు చెన్నమ్మ కూడలిలో ఉన్న వార్డు సచివాలయాల్లో జరిగిన పలు అభివృద్ధి పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.నిర్మాణాల పురోగతి ఎంత వరకు ఉందో స్వయంగా కొలతలు వేయించి గమనించారు అలాగే సచివాలయాల పరిధిలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ గురించి వార్డు అడ్మిన్ కార్యదర్శులను ప్రశ్నించి కమిషనర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కల్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న డ్రైన్లల్లో పూర్తిగా మురుగు కూరుకుపోయిందని వెంటనే అక్కడ పూడికతీత పనులు చేపట్టాలని సంబంధిత పారిశుద్ధ్య పర్యవేక్షకుడిని ఆదేశించారు. అలాగే అక్కడే కల్వర్టు కింద వెళ్లిన తాగునీటి ప్రధాన పైప్ లైన్ తీయించి సరిచేయలంటూ ఏఈ జనార్దన్ ను సూచించారు.నగరంలో స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ఇంజినీరింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ తెలియజేశారు. అనంతరం ప్రజల వినతుల మేరకు సవారీ తోటలో అసంతృప్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని డీఈ రాధాకృష్ణ కు ఆదేశించారు. ఉద్యానవనాలతోనే ప్రజలకు మానసిక ఉల్లాసం సాధ్యపడుతుందని నగరంలోని సీతారాం నగర్ వీనస్ కాలనీ పార్కులను పరిశీలించి అనంతరం ఆయన తెలిపారు. కమిషనర్ వెంట ఎస్ఈ సురేంద్రబాబు ఎంఈ2 రమణమూర్తి డీఈలు ఆర్.రాజశేఖర్ రాధాకృష్ణ ఏఈ జనార్దన్ హార్టికల్చర్ ఏడీ సుజాత ట్యాప్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa