ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల భాగస్వామ్యంతోనే ప‌ల్లెల్లో ప‌రిశుభ్ర‌త‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 02, 2020, 03:08 PM

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతోనే ప‌ల్లెల్లో ప‌రిశుభ్ర‌త సాధ్య‌మ‌నే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్ర‌భుత్వం మనం మన పరిశుభ్రత  కార్యక్రమం తీసుకొచ్చింద‌ని  డివిజనల్ పంచాయతీ అధికారి నూర్జహాన్, ఎంపిడిఓ గీతవాణి తెలిపారు. సోమవారం మండలం పరిధిలో ఆరేకల్ గ్రామంలో మ‌నం మ‌న ప‌రిశుభ్ర‌త  కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ  పరిశుభ్రతపై ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పించారు. చెత్త సేక‌ర‌ణ‌ సక్రమంగా జరిగేలా గ్రామ పెద్దలు,  గ్రామ వాలంటరీ చూడాలన్నారు. ఈ నేప‌థ్యంలో చెత్తసంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఈఓపిఆర్డి నాగరాజ్, ఏపీఓ చంద్రశేఖర్, ఐకెపి ఎపిఎం జనార్ధన్‌, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa