ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పార్టీ మీడియా ప్రతినిధిగా మహబూబ్ బాషా ఎన్నిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 02, 2020, 03:02 PM

ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ జవ్వాజి ఆధ్వర్యంలో జనసేన పార్టీ మీడియా ప్రతినిధిగా యు. మహబుబ్ బాషా ను ఎన్నిక చేయడం జరిగింది. ఎమ్మిగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం రోజు మూడు మండలాలు అయినటువంటి ఎమ్మిగనూరు,గోనెగండ్ల,నందవరం, గ్రామాలకు చెందిన ముఖ్య నాయకుల సమక్షంలో కమిటీ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.ఇంచార్జి రేఖ జవ్వాజి మాట్లాడుతూ ప్రజా సమష్యాలపై పోరాటం చేసే ప్రతి విషయాన్ని దినపత్రికల ద్వారా ప్రజలకు సమాచారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందులో భాగంగా క్రమశిక్షణాతో బాధ్యత రహితంగా ఒక ప్రతినిధిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారానే పాత్రికేయులకు పార్టీ చేసే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అందించేందుకు గాను కమిటీ ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.మూడు మండలాలకు సంబంధించి పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు చేసిన పార్టీ కార్యకర్తలు ప్రతినిధి ద్వారానే పత్రికలకు అందేలా కృషిచేయాలని వ్యక్తిగతంగా పార్టీ పేరుతో వార్తలు పంపించిన పార్టీకి సంబంధం లేదని ప్రతి కార్యకర్త విషయాన్ని గుర్తించాలని కోరారు, ఎవరైనా క్రమశిక్షణ రహితంగా వార్తలు పంపితే పార్టీకి సంబంధం లేదని క్రమశిక్షణ చర్యలకు గురవుతారని తెలిపారు,అదేవిదంగానే ఎమ్మిగనూరు నియోజకవర్గనికి సంబందించిన పట్టణ మరియు మండలాల కమిటీలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు,ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు,రాహుల్ సాగర్,వెంకటేష్, రవి,బజారి,జానీ,ఖాసీం,పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa