ఈనాటి రోజుల్లో ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు ఎక్కువయ్యాయి. ప్రేమ పేరుతో మోసాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఓ యువకుడు తనను ఓ అమ్మాయి ప్రేమించలేదని వేధింపులకు పాల్పడ్డాడు. అదికూడా హైటెక్ పద్దతుల్లో ఆమెను వేధిస్తూ నరకయాతన చూపించాడు. వేధింపులపై యువతి కుటుంబ సలహా కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల వివరాల మేరకు.. కర్ణాటకలో ఓ 24 ఏళ్ల యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ వైట్ ఫీల్డ్లో నివాసం ఉంటోంది. ఆమెకు నెల రోజుల క్రితం స్కైప్ ద్వారా గుర్తు తెలియని నంబరు నుంచి కాల్స్ వచ్చాయి. అవతలి వ్యక్తి ఫోన్ ఎత్తగానే అశ్లీలంగా మాట్లాడాడు. లాక్డౌన్ వల్ల పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయింది. నిత్యం ఇదే తరహాలో కాల్స్ రావడంతో వేధింపులు తట్టుకోలేక కుటుంబ సలహా కేంద్రానికి ఫిర్యాదు చేసింది.నిందితుడిని గుర్తించేందుకు కుటుంబ సలహా కేంద్ర సిబ్బంది సైబర్ పోలీసులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో కాలేజీ చదివే సమయంలో తన క్లాస్మెట్ తనను ప్రేమిస్తున్నట్టు వేధింపులకు గురి చేశాడనే విషయం చెప్పింది. దాని ఆధారంగా కుబుంబ సలహా కేంద్రం అధికారులు సదరు యువకుడి గురించి ఆరా తీశారు. దీంతో అతడు ముంబయిలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్టు తేలింది. అధికారులు ఆ యువకుడికి ఫోన్ చేసి విచారించడంతో మొదట తనకు సంబంధం లేదని చెప్పాడు. అనంతరం తానే ఆ పని చేసినట్టు ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసి యువతి ఆశ్చర్యపోయింది. చివరకు ఆ వ్యక్తి యువతికి క్షమాపణ చెప్పడంతో బాధితురాలు కేసు ఉపసంహరించుకుంది. ప్రేమ పేరుతో ఇటువంటి మోసాలు సాధారణమైపోయాయని, యువత ఇటువంటి తప్పులు చేయకండి పోలీసులు సూచించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa