ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో లాంచ్ కానున్న నోకియా స్మార్ట్ టీవీ!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 30, 2020, 11:48 AM






దేశంలో నోకియా 43 అంగుళాల కొత్త స్మార్ట్ టీవీని త్వరలో లాంచ్ చేయనుంది. ఆ టీవీని జూన్ 4వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టీవీ కేవలం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ.31,000 నుంచి రూ.34,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. అయితే 43 అంగుళాల స్మార్ట్ టీవీలో ఉన్న ఫీచర్లతోనే 55 అంగుళాల స్మార్ట్ టీవీని కూడా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ నోకియా స్మార్ట్ టీవీ జేబీఎల్ ఆడియో, డాల్బీ విజన్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తోంది. నోకియా 55 అంగుళాల స్మార్ట్ టీవీని గతేడాది డిసెంబర్ లో లాంచ్ చేసింది. దాని ధర రూ.41,999గా ఉంది. ఇందులో 55 అంగుళాల 4కే హెచ్ డీఆర్ ఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, డాల్బీ విజన్, హెచ్ డీఆర్ 10 టెక్నాలజీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఉండే ఇంటెలిజెంట్ డిమ్మింగ్ టెక్నాలజీ ద్వారా దీని డిస్ ప్లే మరింత మెరుగ్గా పనిచేస్తుంది. దీనిలో 24W బాటమ్ ఫైరింగ్ స్పీకర్లను అందించారు. డాల్బీ ఆడియో, జేబీఎల్ టెక్నాలజీ ఇందులో కూడా ఉంది. ఇందులో రెండు యూఎస్ బీ పోర్టులు, మూడు హెచ్ డీఎంఐ పోర్టులు, వైఫై, బ్లూటూత్, ఒక ఎథర్ నెట్ పోర్టు ఉన్నాయి.









 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa