నిమ్మకాయ నీళ్లు తాగడం వలన బరువు తగ్గడం నుంచి, కాన్సర్ వరకూ ప్రతి సమస్య పరిష్కారమవుతుందని వైద్యులు చెప్తుంటారు. ఇంతకూ నిమ్మకాయ నీళ్లు గోరువెచ్చగా తాగితే మంచిదా లేక చల్లగా తాగితే మంచిదా? ఇప్పుడు తెలుసుకుందాం..
పోషకాహార నిపుణుల సలహా మాత్రం నిమ్మకాయ నీళ్ళు గోరు వెచ్చగానే తాగాలని చెబుతున్నారు. ఇందులోని సిట్రస్ స్మెల్ ఎలాంటి వాసననైనా తొలగిస్తుంది. ప్రతి రోజూ తాగడం వల్ల మీ స్కిన్ కేర్ రొటీన్ లో మీరు హైడ్రేషన్ పార్ట్ పూర్తి చేసేసినట్లే. హైడ్రేటెడ్ స్కిన్ స్మూత్ గా ఎలాంటి ముడతలూ లేకుండా ఉంటుంది.మీ శరీరానికి కావలసినంత విటమిన్ సీ లభిస్తుంది. స్ట్రోక్, హైబీపీ, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది.
నిమ్మకాయ నీళ్ళు స్ట్రెస్ ని తగ్గిస్తాయి. నిమ్మరసం లో ఉన్న పొటాషియం బ్లడ్ ప్రెజర్ ని రెగ్యులేట్ చేస్తుంది. సాధారణంగా కిడ్నీలో రాళ్ళు కాల్షియం ఎక్కువ అవ్వడం వల్ల వస్తాయి. సిట్రిక్ ఆసిడ్ ఎక్కువ ఉన్ననిమ్మకాయ నీళ్లు తీసుకుంటే భవిష్యత్తులో కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ లో పీహెచ్ బాలెన్స్ మెయింటెయిన్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa