కోవిడ్- 19 మహమ్మారి భారత్ ను అతలాకుతలం చేస్తోంది. గత కొన్నిరోజులుగా కేసుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు భారత్ లో 1, 45,380 కేసులు నమోదవగా 60,491 మంది కోలుకున్నారు. 4,167 మంది ప్రాణాలు కోల్పోయారు. మొదటిసారి లాక్ డౌన్ ప్రకటించినప్పుడు కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ 4 సడలింపుల తర్వాత కరోనా ఉగ్రరూపం దాలుస్తుంది. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేసి, వైరస్ విజృంభిస్తున్న సమయంలో లాక్ డౌన్ లో భారీగా సడలింపులు ప్రకటించారని కేంద్ర, రాష్ట్రాలపై విమర్శలు వస్తున్నాయి. లాక్ డౌన్ విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
లాక్ డౌన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పశ్చిమ్ బంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు మొదట్లో కరోనాను అంత సీరియస్ గా తీసుకోలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఆశాజనక ఫలితాలను ఇవ్వడంలేదు. మర్కజ్ ఘటన తర్వాత దేశంలో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. గుజరాత్, తమిళనాడు, ఢిల్లీల్లో కరోనా ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది.
లాక్ డౌన్ విషయంలో కేంద్రం వైఖరి సముచితంగానే ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. లాక్ డౌన్ పటిష్టంగా అమలుచేయడం వల్లనే కరోనా కేసుల్లో పెరుగుదల తక్కువగా ఉండిందని, ఆర్ధిక వ్యవస్థకు ఊతమివ్వడానికే కేంద్రం భారీగా సడలింపులు ప్రకటించిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. జూన్, జులై నెలల్లో కరోనా తీవ్రత భారత్ లో మరింత తీవ్రంగా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. లాక్ డౌన్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించింది.
ఆందోళనకర స్థాయిలో కేసులు పెరుగుతుండడంపై కేంద్రం మరింత మెరుగైన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే భారత్ లో అత్యాధునిక వైద్య సదుపాయాలు కూడా లేవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. తదుపరి లాక్ డౌన్ కఠినంగా ఉండే అవకాశముంది. ప్రజలందరూ కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విధిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa