ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్ళపరిలో బీసీలకు అండగా ఉంటాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 26, 2020, 03:12 PM

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరు మండలం కళ్లపరి గ్రామంలో కర్రెమ్మ దేవాలయం నిర్మాణ విషయంలో వాల్మీకి బోయలపై దాడులు చేసి అక్రమ కేసులు పెట్టడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి జేఏసీ నాయకులు ఉల్చాల లక్ష్మీ నాయుడు, రాఘవేంద్ర నాయుడు, రంగముని నాయుడు, వినోద్ సోమవారం తెలిపారు.గుడి స్థలా వివాదంలో జరిగిన ఘర్షణ విషయం తెలుసుకున్న వారు స్పందించి గ్రామానికి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం గ్రామంలో ఉన్న బీసీలతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని కల్పించారు.ఈ విషయం పై వాల్మీకి నాయకులు మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే సంబంధిత అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు గట్టిగా పోరాడుతాం అని వారికి భరోసానిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa