మే 25 నుంచి ఆగస్టు 24 వరకు రానున్న మూడు నెలల్లో టికెట్ల రేట్లు ఏడు బ్యాండ్లలో రూ.2000 - రూ.18,600 మధ్య ఉంటాయని డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. విమాన సేవలను తిరిగి ప్రారంభించే ప్రణాళికలను వివరిస్తూ, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులలో ఛార్జీల బ్యాండ్లను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కొత్త ఛార్జీల నిర్మాణంలో, ప్రయాణ మార్గాల ఆధారంగా విమాన మార్గాలు ఏడు విభాగాలుగా విభజించబడ్డాయి. అటువంటి ప్రతి విభాగానికి దాని కనీస మరియు గరిష్ట ఛార్జీలు ఉంటాయి. వివరాల ప్రకారం, ఏడు ధరల బ్యాండ్లు విమానాల వ్యవధిపై ఆధారపడి ఉంటాయి. ఇవి 'A' అతి తక్కువ మరియు 'G' పొడవైనవి.
సెక్టార్ A
ప్రయాణ సమయం: 40 నిమిషాల కన్నా తక్కువ
తక్కువ ధర: 2,000
ఎక్కువధర: 6,000
సెక్టార్ B
ప్రయాణ సమయం: 40- 60 నిమిషాలు
తక్కువ ధర: 2,000
ఎక్కువధర: 7,500
సెక్టార్ C
ప్రయాణ సమయం: 60- 90 నిమిషాలు
తక్కువ ధర: 3,000
ఎక్కువధర: 9,000
సెక్టార్ D
ప్రయాణ సమయం: 90- 120 నిమిషాలు
తక్కువ ధర: 3,500
ఎక్కువధర: 10,000
సెక్టార్ E
ప్రయాణ సమయం: 120- 150 నిమిషాలు
తక్కువ ధర: 4,500
ఎక్కువధర: 13,000
సెక్టార్ F
ప్రయాణ సమయం: 150- 180 నిమిషాలు
తక్కువ ధర: 5,500
ఎక్కువధర: 15,700
సెక్టార్ G
ప్రయాణ సమయం: 180- 210 నిమిషాలు
తక్కువ ధర: 6,500
ఎక్కువధర: 18,600
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa