ఏపీ సర్కార్ కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడానికి సంబంధించిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించలేదని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కింద సుమోటోగా తీసుకుంటున్నామని హెచ్చరించింది. సీఎస్, సీఈసీ, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి దీని పై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 28న సుమోటో కేసుగా హైకోర్టు ముందుకు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి కూడా వైసీపీ జెండా కలర్ లో ఉండే మూడు రంగులను గతంలో వేసింది. పార్టీ జెండా రంగులను వేస్తున్నారని పలువురు హైకోర్టు,సుప్రీం కోర్టులను ఆశ్రయించారు. హైకోర్టు, సుప్రీం కోర్టులు ఆ రంగులను తొలగించాలని ఆదేశించాయి. పలు మార్పులతో రంగులు వేస్తామని తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానిని హైకోర్టు ఇప్పుడు రద్దు చేసింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa