ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెయ్యేళ్లయినా చెక్కుచెదరని బుద్ధుని విగ్రహంలోని అస్థిపంజరం...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 05:08 PM

సాధారణంగా ఆలయాల్లో ఉండే పురాతన విగ్రహాల వెనుక ఎన్నో నిగూఢ రహస్యాలు దాగి ఉంటాయి. ఈ ఆలయంలోని బుద్ధ విగ్రహం అన్నింటికంటే భిన్నమైనది. దీన్ని పరీక్షించిన వైద్యులు విగ్రహానికి ఎక్స్‌రే తీయగా అందులో మమ్మీగా భద్రపరిచిన బౌద్ధ సన్యాసి భౌతిక కాయం కనిపించింది. ఎక్స్‌రేలో ఆ సన్యాసి అస్థిపంజరం స్పష్టంగా కనిపించింది. దీంతో అది సుమారు 1000 ఏళ్ల కిందటి విగ్రహం అని అంచనా వేశారు. ఆ విగ్రహంలో ఉన్న సాధువు చైనా లేదా టిబేట్‌కు చెందినవాడు కావచ్చని భావిస్తున్నారు.

‘లివింగ్ బుద్ధ’గా జీవించేందుకు అప్పట్లో బౌద్ధ సన్యాసులు కఠిన ఉపవాసాలు చేసేవారు. శరీరంలో కొవ్వును తొలగించుకొనేందుకు మొదటి వెయ్యి రోజుల్లో ఆహారాన్ని ముట్టేవారు కాదు. కేవలం విత్తనాలు, పండ్లు మాత్రమే తినేవారు. ఉపవాసాల తర్వాత ఆరేళ్లపాటు రాళ్లతో నిర్మించిన సమాధిలోకి వెళ్లి ధ్యానం చేసేవారు. వారితోపాటు ఒక గొట్టం, గంట తీసుకెళ్లేవారు.

ధ్యానం చేస్తూ చనిపోవడం వల్ల వారి శవాలు పద్మాసనంలోనే ఉండేవి. విగ్రహంలో దొరికిన భౌతిక కాయం కూడా పద్మాసనంలోనే ఉంది. ఏది ఏమైనా వెయ్యేళ్ల నుంచి ఒక భౌతిక కాయం విగ్రహం లోపల పాడవ్వకుండా ఉండటం విచిత్రమే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa