ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమ ప్రజలారా ఆ 4రోజులు జాగ్రత్త... బయటకు రావొద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 21, 2020, 05:06 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్యుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇప్పటికే సూర్య భగవానుడు నడినెత్తిన సుర్రుమనిపిస్తున్నాడు. దాంతో ప్రజలు భయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఇప్పటికే 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు సైతం నమోదు అవుతున్నాయి. అయితే మే22 నుంచి 25 వరకు అంటే నాలుగు రోజులపాటు ఏపీలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం మే 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మే 22న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45-47డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

అలాగే పశ్చిమగోదావరి, కృష్ణా , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 -44డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇకపోతే కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41 -42డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇకపోతే మే 23న విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 -48 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43-45డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 -42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మే 24 విజయనగరం , విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44 -46డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42-43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మే 25 ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43-44డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా , గుంటూరు , కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41-42డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38-39డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్ లను వాడాలని సూచించారు. అలాగే ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని సూచించారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు రాష్ట్ర ప్రజలకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa