లాక్ డౌన్ లో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కరోనా సమాచారం పేరుమీద మొబైల్స్కు వచ్చే లింక్లతో జాగ్రత్తగా ఉండాలని సీఐడీ అధికారులు సూచిస్తున్నారు. సైబర్ నేరాగళ్లు పంపే లింక్లు ఎట్టి పరిస్థితుల్లో తెరవద్దని హెచ్చరిస్తున్నారు. పొరపాటున ఆ లింకులు క్లిక్ చేసినా ఇన్స్టాల్ చేయడానికి అనుమతించొద్దని తెలుపుతున్నారు. ఒకవేళ పొరపాటున ఈ రెండూ చేస్తే వెంటనే మొబైల్స్ కాంటాక్ట్స్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని జాగ్రత్త చేసుకోవాలని, ఫ్యాక్టరీ సెట్టింగ్లోకి వెళ్లి ఫోన్ను రీసెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘సెర్బెరస్’ అనే బ్యాంకింగ్ ట్రోజాన్ను మొబైల్స్కు పంపి అకౌంట్లలో డబ్బును ఖాళీ చేస్తున్నట్టు సీఐడి అధికారులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ కు పంపే లింక్లను ఫోన్లలో ఉంచితే క్రెడిట్, డెబిట్కార్డుల డేటాను చోరీ చేసి డబ్బులు మాయం చేస్తారు. కరోనా సమాచారం ఇస్తున్నట్లు సైబర్ కేటుగాళ్లు మెసేజ్లు పంపిస్తున్నారు. ఆ లింక్పై క్లిక్ చేయమని చెబుతున్నారు. ట్యాప్ చేయగానే మొబైల్స్లోకి స్పైవేర్ వచ్చి చేరుతుంది. ఫోన్ వెంటనే సైబర్గాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది.. ఫోన్ బ్యాంకింగ్ యాప్, బ్రౌజర్తో నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవుతారు. యూజర్నేమ్, పాస్వర్డ్ వివరాలతో బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలనూ నొక్కేస్తారు. క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లు, సీవీవీ వివరాలు సెల్ఫోన్లలో సేవ్ చేస్తే అవి కూడా సేకరించి అకౌంట్లలో డబ్బు మాయం చేస్తారు. కాబట్టి అలాంటి లింకులపై జాగ్రత్తగా ఉండాలని సీఐడీ అధికారులు హెచ్చరిస్తున్నారు.