ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో కరోనా కలవరం...ఆ ప్రాంతంలోనే అధిక కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 20, 2020, 04:12 PM

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. వారం ముందువరకు పదుల సంఖ్యలో కేసులు వెలుగుచూడగా...ప్రస్తుతం ఒకట్రెండు చొప్పున నమోదవుతున్నాయి. జిల్లాలో మంగళవారం కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. వాటిలో కర్నూలు నగరం, ఆదోనిల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. నగరంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా 390కి చేరుకోగా...కోలుకున్నవారు 262 మంది ఉన్నారు. వివిధ ఆస్పత్రుల్లో 110 మంది చికిత్స పొందుతున్నారు.

ఆదోనిలో ఒక కేసు నమోదు కాగా ఇక్కడ కేసుల సంఖ్య 13కు చేరుకుంది. ఇక్కడ నమోదైన కేసులన్నీ ఈ వారంలోనే ఉండటం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం నమోదైన రెండు కేసులతో జిల్లాలో కేసుల సంఖ్య 617కు చేరగా రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదైన జిల్లాగా కర్నూలు కొనసాగుతోంది. ఇప్పటివరకు 447 మంది డిశ్చార్జ్ కాగా, 150 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారినపడి జిల్లాలో 20 మంది మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa