సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అనేక అనేక సంక్షేమ పథకాలను చేసారు. రాబోయే మార్చి వరకు ప్రజల కోసం ఏయే సంక్షేమ పథకాలను అమలు చేస్తామనే విషయాన్ని ప్రకటించారు ఈ మేరకు 2020 మే నెల నుండి 2021 మార్చి వరకు ప్రభుత్వ కార్యక్రమాల క్యాలెండర్ను సీఎం జగన్ విడుదల చేశారు. తమ ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి పలు కీలక తేదీలను ఏపీ సర్కార్ ముందుగానే ఫిక్స్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
జూన్ 4న వైఎస్ఆర్ వాహన మిత్రల ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం
జూన్ 10న నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్ లకు రూ.10 వేల ఆర్థిక సాయం
జూన్ 17న వైఎస్సార్ నేతన్న నేస్తం పేరిట ఆర్థిక సాయం
జూన్ 24న వైఎస్సార్ కాపు నేస్తం అమలు
జూన్ 29న ఎంఎస్ఎంఈ లకు రెండో విడతగా రూ. 450 కోట్లు విడుదలజూలై 1న 108, 104 కొత్త అంబులెన్సులు ప్రారంభం
జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా 27 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ
జూలై 29న రైతులకు వడ్డీ లేని రుణాలు
ఆగస్టు 3న వైఎస్సార్ విద్యా కానుక ప్రారంభం
ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ
ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.18,750 అందజేత
ఆగస్టు 19న వైఎస్సార్ వసతి దీవెన కింద పిల్లల తల్లులకు రూ. 10 వేల చొప్పున తొలి విడత చేయూత
ఆగస్టు 26న 15 లక్షలు వైఎస్సార్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
సెప్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా ప్రారంభం
సెప్టెంబర్ 25న వైఎస్సార్ విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల
అక్టోబర్ లో రైతు భరోసా రెండో విడత సాయం
నవంబర్ లో రెండో విడత విద్యాదీవెన
డిసెంబర్ లో అగ్రి గోల్డ్ బాధితులకు సాయం
వచ్చే ఏడాది జనవరిలో అమ్మ ఒడి కార్యక్రమం
రైతు భరోసా చివరి విడత సాయం
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విద్యా దీవెన మూడో దఫా సాయం
మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa