జూన్ నుండి పలు విమానయాన సంస్థలు దేశీయ విమానాల కోసం ప్రయాణికుల నుండి బుకింగ్లు స్వీకరించడం ప్రారంభించాయని పీటీఐ నివేదిక పేర్కొంది. లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాల ప్రకారం, మే 31 వరకు భారతదేశంలో అన్ని వాణిజ్య విమాన కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. దేశీయ విమానాల కోసం బుకింగ్ తీసుకుంటున్నట్లు ఇండిగో, విస్టారా వర్గాలు తెలిపాయి. స్పైస్ జెట్ ప్రతినిధి అంతర్జాతీయ బుకింగ్స్ జూన్ 15 వరకు మూసివేయబడతాయి అని ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే దేశీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా గతంలో తెలిపింది. వాణిజ్య సేవలను తిరిగి ప్రారంభించడం గురించి అధికారిక ప్రకటన కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్ ఇండియా యొక్క ట్విట్టర్ హ్యాండిల్స్ మరియు సంబంధిత వెబ్సైట్లను అనుసరించాలని వైమానిక సంస్థ కోరింది.
సోమవారం, ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎపిఐఐ) జాతీయ అధ్యక్షుడు సుధాకరరెడ్డి కొన్ని విమానయాన సంస్థలు బుకింగ్ ప్రారంభించడం గురించి ఫ్లాగ్ చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 31 వరకు పొడిగించిన వెంటనే, ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఆదివారం షెడ్యూల్ చేసిన అన్ని వాణిజ్య ప్రయాణీకుల విమానాలను మే 31 అర్ధరాత్రి వరకు నిలిపివేసినట్లు తెలిపింది. లాక్ డౌన్ సమయంలో బుక్ చేసిన టికెట్లను రద్దుచేసిన విమానయాన సంస్థలు వినియోగదారులకు పూర్తిగా నగదు వాపస్ చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశీయ క్యారియర్లను కోరింది.
లాక్డౌన్ కారణంగా రద్దు చేయబడిన విమానాలకు నగదు తిరిగి చెల్లించకూడదని నిర్ణయించుకున్న దేశీయ విమానయాన సంస్థలపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు అందిన తరువాత ఈవిధంగా సూచించింది. మార్చి 25 నుండి మే 3 వరకు లాక్ డౌన్ వ్యవధిలో బుక్ చేసుకున్న టికెట్ ఎటువంటి రద్దు ఛార్జీలు లేకుండా పూర్తి వాపసు పొందటానికి వినియోగదారులకు అర్హత ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa