ఎట్టకేలకు సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఆ తేదిని సీబీఎస్ఈ ప్రకటించింది. జూలై 1 నుంచి 15 వరకు 12వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. అలాగే ఈశాన్య ఢిల్లీలో 10 వ తరగతి పరీక్షలు కూడా జూలై 1వ తేది నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నట్లు ప్రకటించింది. పరీక్షలకు వచ్చే ప్రతి విద్యార్థీ కూడా మాస్కులు ధరించి చేతి వెంట శానిటైజర్స్ తీసుకురావాలని సూచించింది. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులు పరీక్షలకు రాకూడదని తెలిపింది. అందుకు సంబంధించి మరో ప్రకటనను కూడా బోర్డు విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.