ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రోడ్డెక్కనున్న బస్సులు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 18, 2020, 04:30 PM

లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను నిన్న విడుదల చేసింది. బస్సు సర్వీసుల విషయంలో నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో ఏపీ పొరుగు రాష్ట్రం తెలంగాణలో బస్సులు నడిపించాలని కేసీఆర్ సర్కార్ ప్రకటన చేసింది. ఇక పోతే ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపటంపై రవాణాశాఖ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు సిద్ధమన్నారు. బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. బస్సుల్లో భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్‌ మార్పులు చేశామన్నారు. పల్లెవెలుగు బస్సుల్లో మార్కింగ్ సిస్టం అమలు చేస్తున్నామన్నారు. సీఎం జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే 24 గంటల్లో సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నాని తెలియజేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa