ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనాలో చైనాను దాటేసిన భారత్..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 16, 2020, 03:49 PM

ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఈ వైరస్ తో జనజీవనం స్తంభించిపోయింది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ప్రభుత్వాలు లాక్ డౌన్ పాటించినప్పటికీ, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కేసుల నమోదయిన దేశాల జాబితాలో చైనాను భారత్ దాటేసింది. చైనాలో కరోనా కేసులు 82941 కాగా, భారత్ లో శనివారం ఉదయం 8 గంటలకు కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం భారత్ లో ఇప్పటివరకు 85940 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 30153 కు చేరింది. ఈ మహమ్మారి ఇప్పటి వరకు 2752 ని బలితీసుకుంది.ఇప్పటికైతే ఇండియా మెరుగ్గా కనిపిస్తున్నా దేశంలో కరోనా ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కావట్లేదు. చైనా ఒక్క వుహాన్ నగరానికే కరోనాను కంట్రోల్ చేయగలిగింది. మిగతా ప్రాంతాల్లో వైరస్ పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇండియాలో మాత్రం అన్ని రాష్ట్రాలకూ కరోనా పాకింది. అందువల్ల ఇండియాలో పెరుగుతున్న కేసులు ఇప్పట్లో ఆగే ఛాన్స్ లేదని అంటున్నారు. లాక్ డౌన్ పాటించకుండా ఉండుంటే ఇంకా ఎక్కువ కేసులు నమోదయ్యేవి. అయితే ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వస్తోన్న వలస కార్మికులకు వైరస్ నిర్దారణ అవుతోంది. ఈ రెండు నెలల్లో ఇంకా ఎక్కువ కేసులు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే హెచ్చరించింది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 44 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అమెరికాలో అత్యధికంగా కరోనా కేసులు ఉండగా, రష్యా, యూకే, స్పెయిన్‌లో ఆ తర్వాత వరుసలో ఉన్నాయి. భారత్ చైనాను దాటి 11వ స్థానానికి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది చనిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa