కరోనాను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల చాలా మంది తన సొంత గ్రామాలకు వెళ్లలేకపోయారు. కేంద్రం నిర్ణయించిన కొన్ని లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తమ గ్రామాలకు ప్రజలు వెళ్తుండటాన్ని గమనించొచ్చు. అయితే, వారిని నేరుగా సొంత ఊర్లకు వెళ్లనివ్వకుండా క్వారంటైన్ కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. అయితే, ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలను సాధారణ జనాల మధ్య కాకుండా దెయ్యాల గ్రామానికి తరలించాలని నిర్ణయించుకున్నారు.ఉత్తరాఖండ్లో ఖాళీగా ఉండే పాడుబడిన గ్రామాలను ‘ఘోస్ట్ విలేజ్’ అని పిలుస్తారు. అక్కడ ప్రజలు ఎవరూ నివసించారు. ఉత్తరాఖండ్ మొత్తం పర్వత ప్రాంతమే. అక్కడి గ్రామాలన్నీ విసిరేసినట్లుగా ఉంటాయి. వసతులు కూడా అంతంత మాత్రమే. దీంతో ప్రజలు ఆయా గ్రామాలను ఖాళీ చేసి వలసపోతుంటారు. ఫలితంగా ఆ గ్రామాలన్నీ నిర్మానుష్యంగా మారి స్మశానాలను తలపిస్తాయి. సాధారణ గ్రామాల్లో క్వారంటైన్ ఏర్పాటు చేస్తే వైరస్ వ్యాపిస్తుందని ఉద్దేశంతో ఈ దెయ్యాల గ్రామాల్లోని ఇళ్లను శుభ్రం చేయిస్తోంది. పావురీ జిల్లాలోనే 186 దెయ్యాల గ్రామాలు ఉండటంతో అక్కడికి తరలిస్తున్నారు. ఇప్పటివరకు 576 మంది వలస కూలీలను ఆయా గ్రామాల్లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa