ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వలస కార్మికుల కోసం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 14, 2020, 05:52 PM

కరోనా ప్రభావంతో ప్రధాని నరేంద్ర మోదీ 20 లక్షల కోట్ల ఆర్దిక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఆర్ధిక శాఖకు సంబంధించి బుధవారం పలు ప్యాకేజీల వివరాలు తెలియజేసిన విషయం తెలిసిందే. తాజాగా నేడు మరికొన్ని వివరాలను ఆమె వెల్లడించారు. ఆమె ఏమన్నారంటే…
"వ్యవసాయ రంగానికి ప్రత్యేక ఊతంగా ప్యాకేజీ ప్రకటన. వలస కార్మికులు, వీధి కార్మికుల పై ప్రత్యేక దృష్టి. పేదలు,వలస కార్మికులు,వీధి కార్మికుల కోసం 9 పాయింట్ల ప్రత్యేక ఫార్ములా. చిన్న,సన్నకారు రైతుల కోసం ఇప్పటికే రూ.4 లక్షల కోట్లు ఇచ్చాం. 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇప్పటికే ఇచ్చాం. 3 కోట్ల మంది రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు. వలస కార్మికులను కేంద్రం విస్మరించలేదు. సకాలంలో వడ్డీ చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ గడువు పొడిగింపు. మార్చి 1 నుంచి మే 31 వరకు వడ్డీ చెల్లించే రైతులుకు వడ్డీ రాయితీ. నాబార్డు ద్వారా 29,500 కోట్ల రూపాయలను రూరల్ బ్యాంకులు తీసుకున్నాయి. కొత్తగా 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తాం. మార్చి,ఏప్రిల్ లో రూ.86,600 కోట్లు రుణాలు ఇచ్చాం.
మార్చిలో గ్రామీణ వసతుల కోసం రూ.4700 కోట్లు ఇచ్చాం. వ్యవసాయ ఉత్పత్తుల కోసం రాష్ట్రాలకు రూ.6700 కోట్లు కేటాయిస్తున్నాం. వలస కార్మికులకు షెల్టర్,వసతి ఏర్పాటు కోసం రూ.11వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. రాష్ట్రాలు విపత్తు నిధులను వలస కూలీల కోసం వినియోగించాలి. 12 వేల స్వయం సహాయక బృందాలు 1.2 లక్షల లీటర్ల శానిటైజర్ ను ఉత్పత్తి చేశాయి. ఈ బృందాలు 3 కోట్ల మాస్కులు తయారు చేశాయి. వలస కూలీల కోసం ఒకే దేశం,ఒకే వేతనం అమలు చేస్తాం. వలస కూలీలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. నరేగా స్కీం కోసం 3.22 కోట్ల మంది ఎన్ రోల్ చేసుకున్నారు. వలస కూలీల కూలీ రూ.182 నుంచి రూ.202కి పెంచాం. " అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa