ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిస్కంలకు ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 14, 2020, 09:16 AM

కరోనా ప్రభావంతో భారత ఆర్దిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో ఆర్ధిక రంగానికి ఊతమిచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ 20లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించారు. ఆ ప్యాకేజ్ కు సంబంధించిన వివరాలను కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆమె ఏం చెప్పారంటే..

“ఐదు మూల సూత్రాలతో ఆర్దిక ప్యాకేజ్ ప్రకటిస్తున్నాం. ఆర్దిక,మౌళిక,సాంకేతిక,దేశ జనాభా,డిమాండ్ అనేవి ప్రధాన సూత్రాలు. నేటి నుంచి ఒక్కో ప్యాకేజ్ ను ప్రకటిస్తాం. సూక్ష్మ, చిన్న,మధ్య తరగతి పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు. ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు. ఈ రుణాలకు కేంద్రం గ్యారంటి. అక్టోబర్ వరకు ఈ రుణాలు పొందవచ్చు. డిస్కంలు సంక్షోభంలో ఉన్నాయి. డిస్కంలకు రూ.90 వేల కోట్ల సాయం అందిస్తాం. దీని ద్వారా విద్యుత్ సంస్థలకు, వినియోగదారులకు లాభం జరుగుతుంది.” అని నిర్మలా సీతారామన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa