ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మే 18 నుంచి లాక్ డౌన్ 4వ దశకు అంతా సిద్దంగా ఉండాలని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రజలకు సూచించారు. అదే విధంగా పలు సడలింపులతో ప్రభుత్వం పలు పనులకు అనుమతించింది. అయితే ప్రస్తుతం ప్రత్యేక రైళ్లు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా వలస కూలీల తరలింపు ప్రక్రియ జరుగుతుంది.
అయితే ఇప్పటికిప్పుడు ప్రజా రవాణా ప్రారంభమయితే మాత్రం ఖచ్చితంగా భారత్ కు ముప్పు తప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజా రవాణా ప్రారంభిస్తే కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. ప్రస్తుత ఏ రాష్ట్రంలో కూడా బస్సులు,ఆటోలు ప్రారంభం కాలేదు. గ్రీన్,ఆరెంజ్ జోన్లలో బస్సలకు అనుమతించే అవకాశం ఉందన్న సమాచారం ఉంది.
అయితే ప్రజా రవాణా ఇప్పట్లో ప్రారంభించకపోవడమే ఉత్తమమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైన్స్ షాపులు ప్రారంభించే సర్కార్ పెద్ద తప్పు చేసిందని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో వెంటనే వైన్స్ షాపులు బంద్ చేసి ప్రజా రవాణాను కూడా మరి కొంత కాలం పాటు ప్రారంభించవద్దనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజా రవాణాను ప్రారంభిస్తే ఒక బస్సు 100 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎంత భౌతిక దూరం పాటించినా వ్యాధి వ్యాప్తి జరుగుతుంది. బస్సులు ప్రారంభమయితే అంతా భౌతిక దూరం పాటిస్తారన్న నమ్మకం లేదు. మళ్లీ కుప్పలు తెప్పలుగా ప్రయాణాలు చేస్తారు. అందరిని నియంత్రించడం అసాధ్యమని చెప్పవచ్చు.
ప్రస్తుతం వలస కూలీలను వారి ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం 15 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. విదేశాల్లో ఉన్న వారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతుంది. ఈ వలస కూలీల తరలింపు ప్రక్రియ మరో వారం రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత వారి కోసం వేసిన ప్రత్యేక రైళ్లు,విమానాలను రద్దు చేయడం ఉత్తమం. మే 31 వరకు ప్రజా రవాణాను ప్రారంభించకపోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక్క సారి ప్రజా రవాణా ప్రారంభమయితే ప్రయాణికులను నియంత్రించడం కష్టంగా మారే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పట్లో ప్రజా రవాణాను ప్రారంభించకపోవడం ఉత్తమమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ ప్రజా రవాణాకు అనుమతిస్తే భారత్ మరో ముప్పును కొని తెచ్చుకునట్టేనని పలువురు హెచ్చరిస్తున్నారు. ప్రజా రవాణాకు అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా వేలాది కేసులు పెరిగే అవకాశం ఉంది. ఇది భారత్ కు పెద్ద ఎదురు దెబ్బగా మారొచ్చు.
కరోనా కట్టడికి భారత్ తీసుకున్న నిర్ణయాలను ప్రశంసించిన వారే రేపటి నాడు విమర్శించే పరిస్థితి రావచ్చు. అందుకే భారత్ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 50 రోజులుగా సాగుతున్న లాక్ డౌన్ అంతా వృథా అయ్యే అవకాశం లేకపోలేదు. కావున భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మరోసారి ఆలోచించి ప్రజా రవాణాకు సంబంధించిన అనుమతి పై నిర్ణయం తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa