కరోనా ప్రభావంతో భారత ఆర్దిక వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో ఆర్ధిక రంగానికి ఊతమిచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ 20లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించారు. ఆ ప్యాకేజ్ కు సంబంధించిన వివరాలను కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆమె ఏం చెప్పారంటే..
“20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ను ప్రధాని మోడీ ప్రకటించారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రత్యేక ప్యాకేజ్. ప్రధాని దేశానికి మార్గదర్శకం చేశారు. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించాక ఈ ప్యాకేజ్ కు రూపకల్పన చేశాం. ఈ ప్యాకేజ్ దేశ అభివృద్దికి తోడ్పడుతుంది. లోకల్ బ్రాండ్స్ ను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. గత 40 రోజులుగా పీపీఈలు, వెంటిలేటర్లు భారత్ లోనే ఉత్పత్తి చేస్తున్నాం. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి కల్పించే లక్ష్యం మన ముందు ఉంది. పేదలు,వలస కూలీల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశాం. ఇవి సత్ఫలితాలనిచ్చాయి. గడిచిన ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు ఫలితాలనిచ్చాయి.
ఐదు మూల సూత్రాలతో ఆర్దిక ప్యాకేజ్ ప్రకటిస్తున్నాం. ఆర్దిక,మౌళిక,సాంకేతిక,దేశ జనాభా,డిమాండ్ అనేవి ప్రధాన సూత్రాలు. నేటి నుంచి ఒక్కో ప్యాకేజ్ ను ప్రకటిస్తాం. సూక్ష్మ, చిన్న,మధ్య తరగతి పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు. ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలు. ఈ రుణాలకు కేంద్రం గ్యారంటి. అక్టోబర్ వరకు ఈ రుణాలు పొందవచ్చు. నాలుగేళ్లలో తిరిగి చెల్లించేలా 12 నెలల మారటోరియంతో ఈ రుణాలు అందచేస్తాం. రూ.50 వేల కోట్లతో ఎమ్ఎస్ఎంఈలకు ప్రత్యేక నిధి ఏర్పాటు. ఎంఎస్ఎంఈలు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కావడానికి తోడ్పాటును అందిస్తాం. ” అని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa