ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియున్ని చంపిన ప్రియురాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 13, 2020, 05:50 PM

వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ కు ఆంజనేయులుకు 22 సంవత్సరాలు. అతనికి అదే గ్రామానికి చెందిన బాలమణి అనే మహిళతో 2 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో పెద్ద మనుషులలో పెట్టి పంచాయతీ జరిపారు. ఇరువురిని మందలించి ఎవరంతట వారు ఉండాలని సూచించారు. ఇటీవల ఆంజనేయులుకు తన మేనమర్దలుతో వివాహం కుదిరింది.ఈ విషయాన్ని ఆంజనేయులు మే 5న బాలమణికి చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఈ సమయంలో పెళ్లిని బాలమణి వ్యతిరేకించింది. దీంతో ఇద్దరికి తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహం చెందిన బాలమణి కత్తి తీసుకొని ఆంజనేయులు గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత గోనె సంచిలో కట్టి ఇంటికి సమీపంలో ఉన్న డ్రైనేజీలో పడేసింది. ఆంజనేయులు ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.డ్రైనేజీ నుంచి వాసన రావడంతో చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు చూడగా అందులో ఆంజనేయులు మృతదేహం కనిపించింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. బాలమణి కూడా నేరాన్ని ఒప్పుకుంది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa